వరంగల్ : మహాత్మా జ్యోతి రావు ఫూలే గొప్ప విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు అని కొనియాడారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఫూలే విగ్రహానికి మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీలు గుండు సుధారాణి, సీతారాం నాయక్ తదితరులతో కలిసి పూలమాల వేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పాంజలి ఘటించారు.
ఈ వసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ..పూలే సమాజంలోని అసమానతలపై రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. కుల వ్యవస్థ, స్త్రీ విద్య తదితర సామాజిక అంతరాలపై నిజాయితీగా ఉద్యమించిన గొప్ప విప్లవకారుడు పూలే అన్నారు. ఆ మహానుభావుడి ఆశయ సాధనలో మనమంతా ముందుండాలని పిలుపునిచ్చారు.