హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై కావాలనే చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఫు డ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర క్యాబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తిరసరించడాన్ని తప్పుపట్టారు.
బీజేపీపాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఇలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు రాజకీయ అనుభవం ఉందని, వారిని సేవారంగంలో ఎమ్మెల్సీలను చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.