హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను ఉభయసభల ముందుకు బడ్జెట్ను తీసుకురానుంది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కాసేపటి క్రితం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు సుమారు రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. గత బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8-10% వరకు అదనంగా పెంచి రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లుగా చూపనుందని తెలుస్తోంది.