High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక్ సూలులో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకొని, తిరిగి ఇంటర్మీడియట్ తెలంగాణలోనే పూర్తి చేసిన అభ్యర్థిని స్థానికుడు కాదని ఎలా అంటారని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ప్రశ్నించింది. నాలుగేండ్లు వరుసగా తెలంగాణలో చదవలేదన్న కారణంగా ఆ విద్యార్థిని స్థానికేతరుడిగా పరిగణించడంపై అసంతప్తి వ్యక్తంచేసింది.
ఈ అంశాన్ని ప్రభుత్వమే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుని చెప్పాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. తనను మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానిక కోటా కింద పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అవినాశ్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.