మాది నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, తాటికోలు గ్రామం. మా ఊరి ప్రజల తాగు, సాగు నీటికి ఊరిలోని వాగే జీవనాధారం. వాగు ఎండిపోతే ఊరు తల్లడిల్లేది. వాగు వెంబడున్న వ్యవసాయ బోర్ల ను ఈ కారుకు బందు పెట్టాలని గ్రామ పెద్దలు హుకుం జారీ చేస్తే పొలాలు పడావు పెట్టి కూలి పనులకు వెళ్లి జీవనం వెళ్లదీసేవారు రైతులు. ఊరికి మరో వైపున చెరువున్నా ఏ మూడేండ్ల కొకసారో నీళ్లు కనపడుతుండె. అందుకే రైతు లు వ్యవసాయం వదిలి కూలీలుగా మారారు. యువత లారీ క్లీనర్లుగా బతుకీడ్చేవారు.
అలుగు దుంకితే వచ్చిన వరద నీటితోనే అనేక ఊర్లను దాటుకుంటూ మా ఊరి వాగులోకి నీళ్లు వచ్చేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటి పారుదల శాఖ ప్రతి నీటి బొట్టు ను ఒడుపుగా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించింది. రెండు సంవత్సరాల క్రితం నేను ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండేను కలిసినప్పుడు ‘కేసీఆర్ నీళ్ల విధానం మీద ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చగలిగినవేనా?’ అని ప్రశ్నించాను. దానికి ఆ యన గంటసేపు ప్రభుత్వ లక్ష్యాలు, వాటి కోసం తీసుకుంటున్న ప్రణాళికలను విపులంగా చెప్పారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత తాను రాసిన పుస్తకాలు చదువమని ఇచ్చారు. అప్పుడు నేను ఏమో అనుకున్నా కానీ, ప్రజల కల ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు.
ప్రభుత్వం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించడం, హరితహారంలో మొక్కలు నాట డం, మిషన్ కాకతీయలో చెరువుల పూడిక తీయడం, కాల్వల నిర్మాణం చేపట్టడం వల్ల వర్షపాతం పెరిగి భూగర్భ జలాలు పెరిగాయి. దాదాపు సంవత్సరం నుంచి ఎండాకాలంలోనూ మా ఊరి వాగు పారుతూనే ఉన్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మొదలైతే ప్రతి రోజూ మా ఊరి వాగు నిండా నీళ్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఊళ్ళో వ్యవసాయ సాగుబడి పెరిగింది. ఒకప్పుడు కూలి పని దొరకని ఊర్ల్లో కూలీలకు విపరీతంగా డిమాం డ్ పెరిగిపోయింది. ఇదంతా ఊరికే మాటలు చెప్తూ రాజకీయ పదవులను పదిలంగా ఉంచుకోవడం కోసం పనిచేస్తే వచ్చిన మార్పు కాదు, ఖచ్చితమైన లక్ష్యం, అలుపెరుగని ఆత్మవిశ్వాసంతో రైతుల కోసం కేసీఆర్ సాధించిన మార్పు. కేంద్రం ఎలాంటి సహాయం చేయకపోయినా అనుకున్న ప్రతి ప్రాజెక్టును కట్టి నీళ్లు పారిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణ సిరుల మాగాణంగా మారింది. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల మూడు జిల్లాల సాగునీటి, తాగునీటి కష్టాలు తీరనున్నాయి.
ఏదో కేవలం నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకొనుడు కాదు, రైతుబంధు పథకంతో పంట సాయం, 24గంటల కరెంటు సరఫరా, పంట రుణాల మాఫీ, ఎరువుల కొరత లేకుండా చూడటం, పండిన పంటను ఊర్లోనే కొని ఖాతాల్లో డ బ్బులు వేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత. నా చిన్నతనంలో 2గంటల పాటు టూ ఫేస్ కరెంటు వస్తుండె.. అది కూడా ఓవర్లోడయితే ట్రా న్స్ఫార్మర్లు కాలిపోయేవి, మోటార్లు కాలిపోయి పంట లు ఎండిపోయేవి. ఈ కష్టాలకు అంచెలంచెలుగా పరిష్కారాలు చూపుతూ అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు కేసీఆర్. కానీ ప్రతిపక్ష పార్టీలు వాస్తవాలు ఒప్పుకోకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబునాయుడు వంటి నేతలే సాగునీటి సదుపాయం వల్ల తెలంగాణ భూ ముల విలువలు లక్షల్లో పెరిగాయని మెచ్చుకొంటున్నారు. ఇదంతా వ్యవసాయ విప్లవం తెచ్చిన సీఎం కేసీఆర్ ఘనతే.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజె క్టు నల్గొండ జిల్లాలో కూడా సాగు, తాగునీటి లోటును పూడుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో కరువు కంటికి కనిపించకుండా పోతుంది. వర్షాధారిత వ్యవసాయం తగ్గి, ఉత్పత్తి పెరిగి రైతులు, కూలీల ఉపాధికి ఎటువంటి ఢోకా ఉండదు. ఈ రోజు ఈ రైతుల విజయాన్ని తట్టుకోలేని ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు పూర్తి కావొద్దని ఎన్నో కేసులు వేసి ఆపాలని చూశాయి. రైతులకు జరిగే మేలును అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని గుర్తు పెట్టుకోవాలి! ఇది కృతజ్ఞత ఉన్న నేల. కడుపు కొట్టిందెవరు? కడుపులో పెట్టుకొన్నది ఎవరనేది ప్రజలకు బాగా తెలుసు.