హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 31 మందికి స్థానచలనం కల్పించింది. వెయిటింగ్లో ఉన్న 8 మందికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చింది. మరికొందరికి కొత్త పోస్టింగ్లతో పాటు మరికొన్ని శాఖలకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించింది. ముఖ్యంగా హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని నియమించారు. ఆయన ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీ డైరెక్టర్గా శశాంక్ గోయల్ను నియమించారు.