హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగోన్నతి పొందిన వారిలో వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు (1995), స్వాతీ లక్రా (1995), మహేష్ మురళీధర్ భగవత్ (1995), చారు సిన్హా (1996), అనిల్ కుమార్ (1996), వీసీ సజ్జనార్ (1996) ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందినప్పటికీ, ప్రస్తుతం వీరందరూ తాము పని చేస్తున్న స్థానాల్లోనే కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేరొన్నారు.