హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు మంగళవారం విద్యాశాఖలో 3,897 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
దాని కొనసాగింపుగా బుధవారం వైద్యారోగ్య శాఖలోని డీపీహెచ్ పరిధిలో ఉన్న 177 మంది ల్యాబ్ టెక్నీషియన్ల ఉద్యోగాలను గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్లుగా పర్మనెంట్ చేస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్కు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.