హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ఫెయిలైన అభ్యర్థులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. వీరికోసం కొత్తగా ప్రత్యేక పరీక్షలకు అనుమతి ఇచ్చింది. 1990 నుంచి ఇప్పటివరకు (2018లో అడ్మిషన్ పొందినవారు) ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్లో పరీక్షలు ఉంటాయని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. బుధవారం పరీక్షల ఫీజు షెడ్యూల్ను విడుదల చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 10లోపు పరీక్ష ఫీజుగా రూ.3 వేలు చెల్లించాలని తెలిపారు. రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, తత్కాల్ స్కీం కింద మరో రూ. 6 వేల అదనంగా కలిపి ఏప్రిల్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణతో పాటు అభ్యర్థులకు మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిచ్చినట్టు పేర్కొన్నారు.