హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు 317 జీవో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిషత్తు కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకవేళ స్పౌజ్ కేసులు, ఇతర కారణాల వల్ల జోన్ మార్పు కోరుకొనే ఉద్యోగులు గురువారంలోపు దరఖాస్తు చేయాలని సూచించారు. టీవీవీపీ పరిధిలో దాదాపు 2 వేల మంది స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు.