హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2008 బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై విధివిధానాల ఖరారు బాధ్యతను ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది. అభ్యర్థులకు ఏపీలో మాదిరిగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సర్వీస్ నిబంధనలు, షరతులు తదితర అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీకి సూచించింది. 317 జీవోపై అధ్యయనానికి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలనూ అప్పగించింది. విద్యాశాఖ సహకరించాలని ఆదేశించింది.