హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : న్యప్రాణుల రక్షణ, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు నూతన స్టాండింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ స్టాండింగ్ కమిటీకి వైస్ చైర్పర్సన్గా అటవీ పర్యావరణశాఖ మంత్రి, సభ్య కార్యదర్శిగా అటవీశాఖ పీసీసీఎఫ్ (వైల్డ్లైఫ్)లు వ్యవహరించనున్నారు.
కమిటీలో సభ్యులుగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (అటవీ రక్షణ దళాల అధిపతి), వరల్డ్ వైడ్ ఫండ్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా చైర్మన్ అనిల్కుమార్ ఎపూర్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ విశ్వనాథన్, సీసీఎంబీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కార్తీకేయన్, వ్యవసాయ వర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వాసుదేవరావు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి ఎస్ రాఘవేంద్ర యాదవ్, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్తు చైర్మన్ కోవ లక్ష్మిని సభ్యులుగా నియమించారు.