నిజామాబాద్ : జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఆదివారం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ వానలతో గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఫలితంగా గోదావరి నదిలోకి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం 24 గంటల్లోనే పూర్తిగా మునిగి పోవడం కనిపించింది.