హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో ఫార్మా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకంగా మారిందని పలువురు ఫార్మా దిగ్గజ కంపెనీల అధిపతులు చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో మన దేశం వ్యూ హాత్మకంగా ముందుకు వెళ్లిందన్నారు. ఈ సమయం లో పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం మరువలేనిదని, ఈ సహకారం ఇలాగే కొనసాగితే ఫార్మారంగంలో భవిష్యత్తు భారతదేశానిదేనని ధీమా వెలిబుచ్చారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల బయో ఏషియా-2022 అంతర్జాతీయ సదస్సు చివరి రోజైన శుక్రవారం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్ర స్తుత పరిస్థితులు, రాబోయే ఐదేండ్లలో ఎదురయ్యే సవాళ్లు.. వాటిని అధిగమించడంలో ప్రభుత్వాల నుం చి అందాల్సిన సహకారం తదితర అంశాలపై వక్తలలు తమ ఆలోచనలు, సలహాలు పంచుకున్నారు. పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సంఘ్వీ, జైడస్ కాడిలా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పటేల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎంతో ఆశాజనకంగా ఉంటుందని దిలీప్ సంఘ్వీ అన్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రపంచంతో పోటీపడే సా మర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. కరోనా సమయంలో ఫార్మా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నదని జీవీ ప్రసాద్ చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో మనదేశం వ్యూహాత్మకంగా ముందుకెళ్లిందని, పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం మరువలేనిదని అన్నారు. ఈ సహకారం ఇలాగే కొనసాగితే పరిశ్రమల అభివృద్ధితోపాటు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో యుద్ధంతో ఫార్మా పరిశ్రమలకు ముడి సరుకు అందడంలో ఇబ్బంది తలెత్తే ప్రమాదమున్నదని అంచనా వేశారు. ప్రపంచం చైనా వస్తువులను వినియోగించడాన్ని వ్యతిరేకిస్తున్నదని, ఈ నేపథ్యంలో భా రతీయ కంపెనీలు యావత్ ప్రపంచానికి మంచి చాయిస్లా కనిపిస్తున్నాయని పంకజ్ పటేల్ అభిప్రాయపడ్డారు. చైనా తర్వాత నమ్మకమైన మార్కెట్గా భారత్కు గుర్తింపు ఉన్నదని చెప్పారు. జనరిక్స్, టెక్నాలజీ వంటి వాటిపై మరింత దృష్టి సారిస్తే ప్రపంచం దృష్టిని మనం ఎక్కువగా ఆకట్టుకోగలమన్నారు. తయారీ రంగం, ఉత్పత్తి రంగంలో మార్పులు పెరగాలని అన్నారు. ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారం భారీగా ఉంటుంది కనుక.. ఆ కో ణంలో ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. రాబో యే ఐదేండ్లలో పరిశ్రమ పరిమాణంపై మీ అంచనా ఏమిటన్న ప్రశ్నకు.. అన్ని ప్యానెళ్లు కలిసి 130 బిలియన్ డాలర్లతో ఏకీభవించాయని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఫాబా ఆధ్వర్యంలో నిర్వహించిన బయోఏషియా-2022 సదస్సు 19వ ఎడిషన్ శుక్రవారం ముగిసింది. ‘ఫ్యూచర్ రెడీ’ థీమ్తో నిర్వహించి న ఈ సదస్సులో కొవిడ్ అనంతర పరిణామాలపై 70 దేశాలకు చెందిన పరిశ్రమలు, ప్రముఖులు వివిధ అం శాలపై చర్చలు జరిపారు. వర్చువల్గా సాగిన ఈ సదస్సులో 37,500 మంది నిపుణులు పాల్గొన్నారు. సీఈ వో కాంక్లేవ్, జీవశాస్ర్తాల రంగం పురోగతిపై ఫైర్చాట్లు, బృంద చర్చలు నిర్వహించారు. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోపన్యాసం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో మంత్రి ఫైర్చాట్ కీలకంగా నిలిచాయి. కార్బెవాక్స్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చినందుకు బయలాజికల్ -ఈ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మహిమా దాట్లకు డా బీఎస్ బజాజ్ మెమోరియల్ ఫాబా అవార్డు, ఆల్ ఇండియా బయోటెక్ అసోసియేషన్స్, ఫాబా (ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్)కు అందించిన విశిష్ఠ సేవలకుగాను మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు ఫాబా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): బయో ఏషియా సదస్సులో బిల్గేట్స్తో సంభాషణను ఎంజాయ్ చేశానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్లో లైఫ్సైన్సెస్కు ఉన్న అద్భుత అవకాశాలను బిల్గేట్స్కు పరిచయం చేశానని తెలిపారు. ‘ఈ అవకాశం నాకు కల్పించిన బిల్గేట్స్కు థాంక్స్..’ అంటూ శుక్రవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. దానిని నెటిజన్లు రీ ట్వీట్ చేస్తున్నారు. గేట్స్ను సదస్సులో భాగస్వామిని చేసినందుకు కేటీఆర్ను ప్రశంసిస్తున్నారు.