హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మొట్టమొదటి స్కిల్ వర్సిటీని సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్లతో కూడిన కమిటీని నియమించింది. ఇటీవలే ఈ కమిటీ కొడంగల్లోఐదారు స్థలాలను సందర్శించి, వర్సిటీ ఏర్పాటుకు అనువైనవా లేదా అని పరిశీలించింది. కొత్తగా కొడంగల్లో ఏర్పా టు చేసే ఈ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.