హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన పీజీఈసెట్ మొదటి విడత వెబ్కౌన్సెలింగ్లో బుధవారం 5,662 (79%) సీట్లను కేటాయించారు.
కన్వీనర్ కోటాలో మొత్తం 7,922 సీట్లుండగా, 7,152 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 5,662 మంది అభ్యర్థులు సీట్లను దక్కించుకొన్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 8 నుంచి 15 వరకు ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.