హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ఇంజినీరింగ్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. తొలిరోజు 42,045 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల 28 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశముండగా, 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడుతారు.
ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 10లోగా సీట్లు కేటాయిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన తెలిపారు.