ఫర్టిలైజర్ సిటీ, మే 24: కూతురు పెండ్లయిన కాసేపటికే తండ్రి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం నిం పింది. స్థానికులు, బా ధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని విఠల్నగర్లో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు ఎలిగేటి శంకర్(53) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కుమార్తె ప్రత్యూష వివాహం మంచిర్యాల జిల్లా దండెపల్లి సమీపంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన సంతోష్తో బుధవారం జరిగింది.
సింగరేణి కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుక పూర్తయిన కాసేపటికే శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను ఇంటికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా మారడంతో గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్. శంకర్కు కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. ఆయన తండ్రి సింగరేణి ఉద్యోగం రీత్యా గోదావరిఖనిలో స్థిరపడ్డారు. సీనియర్ జర్నలిస్టు అయిన శంకర్ రామగుండం ప్రాంతానికి సుపరిచితుడు.