హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం రుణ విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ, రైతుసంఘాల నేతలు టీ సాగర్, రాయల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయమైన మఖ్ధూంభవన్లో మంగళవారం జరిగిన రైతుసంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.