పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, వారికి నియోజకవర్గాల కేటాయింపు పూర్తయింది.
ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చిన ఎన్నికల సంఘం.. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు కోసం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో సమావేశాన్ని నిర్వహించనున్నది. సీఈవో వికాస్రాజ్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.