హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్టీ పోలీసుల నిఘా పెంచనున్నారు.
ఒక్కో కేంద్రంలో ఇద్దరు రెవెన్యూ, మున్సిపల్శాఖ అధికారులను ప ర్యవేక్షకులుగా నియమించాలని ఆదేశించిం ది. విద్యార్థినులను, మహిళా పోలీసులతో తనిఖీలు చేపట్టాలని సూచించింది.