చాదర్ఘాట్, అక్టోబర్ 30: ఈ ఏడాది దుబాయ్-భారత్ అంతర్జాతీయ ఎక్సలెన్స్ అవార్డును మార్షల్ ఆర్ట్స్ సీనియర్ మాస్టర్ సయ్యద్ ఇఫ్తేకార్ హుస్సేన్ దక్కించుకొన్నారు. మార్షల్ ఆర్ట్స్ బెస్ట్ పర్సనాలిటీ విభాగంలో ఆయనకు అవార్డు లభించింది. దుబాయ్లోని అల్ నాసర్ లీజర్ల్యాండ్లో దాదా సాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డ్ ఫిల్మ్స్(డీపీఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇందులో దాదా సాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డు ఫౌండేషన్ చైర్మన్ కల్యాణ్జీ జానా, దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారి యాకుబ్, బాలీవుడ్ నటులు ఆదిల్ దుర్రానీ, షెర్లిన్ చోప్రా చేతులమీదుగా ఇఫ్తేకార్ హుస్సేన్ అవార్డును అందుకొన్నారు. దుబాయ్-భారత్ అంతర్జాతీయ ఎక్సలెన్స్ అవార్డు ను మొదటిసారిగా తనకు దక్కడం పట్ల ఇఫ్తేకార్ హుస్సేన్ సంతోషం వ్యక్తం చేశారు.