హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్, జువైనల్ జస్టిస్ వెల్ఫేర్ బోర్డు పరీక్షలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటల నుంచి 11 వరకు 100 మార్కులకు మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి రాష్ట్రంలోని 36 సీడబ్ల్యూసీ, జేజేబీ బోర్డులకు వేర్వేరుగా చైర్పర్సన్/చైర్మన్తో పాటు నలుగురి సభ్యులను ఎంపిక చేయనున్నారు.