హైదరాబాద్, జూన్ 29 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో చేపట్టిన అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఐ అండ్ ఆఫీస్ ఎదుట డెస్ సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్ మాట్లాడుతూ సీనియారిటీ ఉన్నా అసంబద్ధ కారణాలతో డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు నిరాకరించడం సరికాదని మండిపడ్డారు. పదేండ్లకు పైగా అనుభవం ఉన్న డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని కోరారు.
సర్క్యులేషన్తో ముడిపెట్టి కార్డులు నిరాకరించడం కారణంగా అర్హులైన వందలాది మంది డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం యాడ్స్తో సంబంధం ఉన్న సర్క్యులేషన్ను ఇలా కార్డుల జారీల ప్రక్రియలో సాకుగా చూపడం ఏంటని మండిపడ్డారు. డెస్క్ జర్నలిస్టులకు గతంలో ఉన్న కార్డులకు పెద్ద సంఖ్యలో కోత పెట్టి ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు లేనిచోట, ఆ కోటా కార్డులు అదే సంస్థలో పనిచేస్తున్న ఇతర జర్నలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యాజమాన్య కోటాతో సంబంధం లేకుండా దివ్యాంగులైన వరింగ్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెజారిటీ జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులకు ఇప్పటివరకు కార్డులు అందలేదని తెలిపారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐ అండ్ అడిషనల్ జగన్కు అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ డెస్క్ జర్నలిస్టుల సమస్యలను కమిషనర్ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ధర్నాలో డీజేఎస్ కార్యదర్శి కేఎన్ ట్రెజరర్ వీ వెంకటరమణ, జాయింట్ కనపర్తి రమేశ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పీ పద్మ, సంఘం ప్రతినిధులు సిలివేరు వెంకటేశ్, చల్లా సైదిరెడ్డి, రాచపల్లి రమేశ్ అశోక్ రమేశ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు ఉద్దేశపూర్వకంగానే కార్డుల జారీలో జాప్యం చేస్తున్నారని డెస్క్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. పలు పత్రికలకు ఇష్టారాజ్యంగా కార్డులు ఇస్తున్న అధికారులు మరికొన్నింటికి సర్క్యులేషన్ను సాకుగా చూపి నిలిపివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో కమిటీ మీటింగ్ల పేరిట కార్డుల జారీ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని, పలుమార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్వయంగా సంబంధిత మంత్రి పొంగులేటిని పలుమార్లు కలిసి విన్నవించినా, మీడియా అకాడమీ, ఐఅండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం సరైన రీతిలో స్పందించడం లేదంటూ డెస్క్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.