జమిలి ఎన్నికల ప్రతిపాదన అందుకే
రాష్ర్టాల హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం
రాజ్యాంగంపై సమీక్షకు మాజీ ప్రధాని వాజపేయి కమిషన్ వేయలేదా?
2002లో కమిషన్ నివేదిక ఏమైంది?
రాజ్యాంగంపై చర్చ కొత్తేమీ కాదు
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మోదీ కోసం దేశంలో అధ్యక్ష తరహా పాలనను ప్రవేశపెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. అందుకోసమే జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. మంత్రుల నివాసంలో బుధవారం ఎమ్మెల్సీ బండ ప్రకాశ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి నివేదికలు లేకుండానే ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోతున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నదని, రాష్ట్రాల హకులను ప్రధాని కాలరాస్తున్నారని అన్నారు. అంబేదర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై చర్చ అనే అంశం కొత్తదేమీ కాదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇది జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారని వినోద్కుమార్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జస్టిస్ రాజమన్నార్ కమిషన్ వేశారని తెలిపారు. 2000 సంవత్సరంలో రాజ్యాంగం పనితీరుపై సమీక్షకు మాజీ ప్రధాని వాజపేయి కూడా జస్టిస్ వేంకటాచలయ్య నేతృత్వంలో న్యాయనిపుణులు సొలీ సొరాబ్జీ, పరాశరన్, సరారియా, జీవన్రెడ్డి, పున్నయ్య, సుభాష్ కశ్యప్ వంటి వారితో ఓ కమిషన్ వేశారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు చెప్పారు. 2002లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వాజపేయికి నివేదిక సమర్పించిందని, బీజేపీ నాయకుల దురదృష్టమో, దేశ ప్రజల అదృష్టమో కానీ బీజేపీ పరాజయంతో ఆ నివేదిక అటక ఎకిందని ఆయన తెలిపారు.
దేశ అవసరాలకు అనుగుణంగా
దేశ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని అంబేదర్ చెప్పారని, అందుకోసం ఆర్టికల్ 368 ద్వారా అవకాశం కల్పించారని వినోద్కుమార్ అన్నా రు. కేసీఆర్ కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే చెప్పారని స్పష్టంచేశారు. రాష్ట్రాల హకులను కాలరాసేలా కేంద్రం వ్యవహరించ డం, నదీజలాల సమస్యలను పరిషరించకపోవడం, జీఎస్టీ వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు.
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకివ్వరు?
ఉత్తరప్రదేశ్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తూ రూ.49 వేల కోట్లు బడ్జెట్లో ప్రకటించారు కానీ తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకివ్వరని వినోద్కుమార్ ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో పలు వివాదాలను పరిషరించకుండా కేంద్ర జల్శక్తి మంత్రి నదుల అనుసంధానం చేస్తామని ఎలా చెబుతారని నిలదీశారు. నదుల అనుసంధానం ఒక బక్వాస్ ముచ్చట అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో హైదరాబాద్కు ఎకడ పేరు వస్తుందో అని మన నగర ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రధాని కుట్ర చేస్తున్నారని, తెలంగాణను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. సింగపూర్, హాంకాంగ్, జెనీవా తర్వాత అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటయ్యేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారని, దీన్ని దెబ్బ తీసేందుకు మోదీ నిన్నటి బడ్జెట్ ప్రతిపాదనల్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్ను గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు దమ్ముంటే గుజరాత్ ప్రతిపాదనలను విరమింపచేసి హైదరాబాద్ ప్రతిష్ఠను కాపాడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజలు బీజేపీని నమ్మవద్దని, హైదరాబాద్ గౌరవాన్ని కాపాడుకొనేందుకు కలిసి రావాలని, వాస్తవాలు గ్రహించాలని అని ఆయన పిలుపునిచ్చారు.