ములుగురూరల్, డిసెంబర్ 21: ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ సోదరుడు కుసుమ జయప్రకాశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో నివాసముంటున్న జయప్రకాశ్కు బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతదేహాన్ని స్వగ్రామం మల్లంపల్లికి తరలించి, గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. ములుగు జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్న క్రమంలో కుసుమ జగదీశ్వర్ గత జూన్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆరు నెలలు గడువకముందే జయప్రకాశ్ కూడా గుండెపోటుతోనే మరణించడం బాధాకరం.