హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ నటి జమున మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆమె ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
బంగారు పాప, మిస్సమ్మ, గులేబకావలి కథ, చింతామణి, లేతమనసులు వంటి 150 కి పైగా చిత్రాలలో నటించిన ఆమె సత్యభామ పాత్రకు ప్రత్యేకత ఉంది అన్నారు. ఇటీవల చిత్ర పరిశ్రమలో ని ప్రముఖులు వరుసగా మరణిస్తుండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.