Pending Challans | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ పెండింగ్ చలాన్ల గడువు జనవరి 31తో ముగియనుంది. మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసు శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆ గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం పెరిగింది.