లక్నో: హోలీ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక పోలీస్ అధికారి ఫిర్యాదుదారులకు గంగా జలం సీసాలను పంపిణీ చేశారు. గంగా జలాన్ని చల్లుకొని కరోనా వంటి రోగాల నుంచి విముక్తి పొందాలని కోరారు. మీరట్ జిల్లాలోని నౌచండి పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ చంద్ శర్మ హోలీ నేపథ్యంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు కోసం స్టేషన్కు వచ్చే వారికి గంగా జలం సీసాలు బహుమతిగా ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో హోలీ నాడు రంగు నీళ్లకు బదులు గంగాజలాన్ని చల్లుకోవాలని శర్మ సూచించారు. ఇది శానిటైజర్గా పనిచేస్తుందని, అనేక రోగాల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హోలీ నాడు ఎవరికీ మద్యం సీసా ఇవ్వవద్దని, దానికి బదులు గంగా జలం ఇవ్వాలని సూచించారు. గంగాజలం శానిటైజర్ అని, దీన్ని చల్లుకోవడం వల్ల కరోనా వంటి రోగాల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని వెల్లడించారు.