కూసుమంచి రూరల్, మార్చి 17: మరికొన్ని గంటల్లో కూతురి పెండ్లి జరగాల్సి ఉండగా అంతలోనే గుండెపోటుతో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలో చోటుచేసుకున్నది. గట్టుసింగారం గ్రామానికి చెందిన చింతేటి అర్జున్రావు (42) వైద్యారోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు.
ఇటీవల కుమార్తెకు పెండ్లి కుదిరింది. శుక్రవారం అర్ధరాత్రి ముహూర్తానికి వివాహ వేడుక జరగాల్సి ఉన్నది. గురువారం ఉదయం అర్జున్రావు భార్యతో కలిసి బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు అందించాడు. ఈ క్రమంలో అర్జున్రావుకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. పెండ్లి కోసం వచ్చిన బంధువుల రోదనలు మిన్నంటాయి.