Congress | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కాంగ్రెస్ పార్టీ దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈసారి ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ను బద్నాం చేసేందుకు కుట్ర చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఐబీ పేరిట ఫేక్ సర్వే రిపోర్టును బయట పెట్టారు.
నవంబర్ 23న ఈ సర్వే ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించినట్టు, అందులో బీఆర్ఎస్కు తకువ సీట్లు, కాంగ్రెస్కు ఎకువ సీట్లు వచ్చినట్టు ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అనుకూల మీడియాల్లో, సోషల్ మీడియాలో చకర్లు కొట్టించారు. ఈ విషయమైన ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్ కుమార్ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా ఆయన అవన్నీ బోగస్ సర్వేలని తేల్చారు. ఇంటెలిజెన్స్ పేరిట తాము ఏ సర్వే ఇవ్వలేదని.. తమ పేరిట ఎవరైనా బోగస్ రిపోర్టులు తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రా ఏజెన్సీ లోగో పెట్టి ఇట్లాంటి మోసాలకు తెగబడితే.. ఉపేక్షించబోమని చెప్పారు.