హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో 14వ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 12 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలు, బడులు, కాలేజీల్లో వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఈ కార్యక్రమ నిర్వహణకు చర్యలు చేపట్టాలని మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1 నుంచి 19 ఏండ్ల బాలబాలికలకు అల్బెండోజ్ గుళికలు ఇస్తారు.