TSPSC | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి బాటలోనే కమిషన్ సభ్యులు నడుస్తున్నారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డిని జనార్దన్రెడ్డి కలిశారు. అనంతరం రాజీనామా చేశారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని టీఎస్పీఎస్సీ సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్ తానోబా, కారం రవీందర్రెడ్డి, ఆర్ సత్యనారాయణ కలిశారు.
ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయిట్మెంట్ కోరారు. గవర్నర్ అందుబాటులోలేరని, వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని గవర్నర్ కార్యాలయం తెలిపింది. దీంతో నేడో, రేపో గవర్నర్ను కలిసి రాజీనామాలు అందజేయాలని కమిషన్ సభ్యులు నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్ సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.