హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని వ్యాపారులపై గోధుమల నిల్వపై పౌరసరఫరాలశాఖ ఆంక్షలు విధించింది.
ఇప్పటినుంచి 2024 మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.