హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సత్వరమే ఉమ్మడి సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మీటింగ్ మినిట్స్లోనూ ఈ అంశాన్ని పీపీఏకు, ఆంధ్రప్రదేశ్కు నొక్కిచెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో జనవరి 25న ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రాతిపాదించిన ఉమ్మడి సర్వేతోపాటు పలు అంశాలకు సీడబ్ల్యూసీ అంగీకారం తెలిపింది. పీపీఏకు, ఏపీకి ఆ సమావేశంలో స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ మీటింగ్ మినిట్స్ను కూడా రాష్ట్రాలకు అందజేసింది. తెలంగాణ ప్రతిపాదించిన అంశాలపై జాయింట్ సర్వే చేయాలని స్పష్టం చేసింది.