హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆకాంక్షలకనుగుణంగా వేతన సవరణను సిఫారసు చేయాలని పీఆర్సీ కమిటీని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరింది. నూతన పీఆర్సీ కమిటీ చైర్మన్గా శివశంకర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం సచివాలయంలో ఆ యనను టీఎన్జీవో నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శు భాకాంక్షలు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా.. మెరుగైన ఫిట్మెంట్ ఫార్ములాను సిఫారసు చేయాలని కోరారు.
గడువులోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తిచేశా రు. చైర్మన్ను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్వి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూ రి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీ బ్ హుస్సేని, విక్రమ్, లక్ష్మణ్, శ్రీకాంత్, హరికృష్ణ, శ్రావణ్, కిరణ్, నర్సింహులు, గౌస్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్రావు, రాజ్కుమార్, కొండల్రెడ్డి, శైలజ, గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతిని పెంచాలని టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్, ముత్యాల సత్యనారాయణగౌడ్ బుధవారం మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని, రెండు డీఏలను మంజూరుచేయాలని, సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను అమలుచేయాలని కోరారు.