Handloom Workers | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది.దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది. దీంతో నేతన్నలు తమను ఆదుకునే దిక్కులేక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసలు, ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న చేనేత కార్మికులకు తెలంగాణ ఏర్పాటు తర్వాత మంచి రోజులొచ్చాయి.
ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా గుర్తించి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. నేతన్నలకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని చేపట్టి ఏటా నేత సంఘాలకు సుమారు రూ.350 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధుల యూనిఫామ్స్ను చేనేత కార్మికులతో తయారు చేయించేందుకు ఏటా రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయడంతోపాటు నూలు, రంగులు తదితర ముడి సరుకులపై 40 శాతం సబ్సిడీ అందించింది. రైతు బీమా తరహాలో నేతన్నకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి భరోసా కల్పించింది. దీంతో ఆత్మహత్యలు ఆగిపోవడమే కాకుండా బతుకుదెరువు కోసం గతంలో గుజరాత్, బొంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లిన నేతన్నలు ఇంటిబాట పట్టారు.