హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను సీబీఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డి హాజ రు కాగా, అనారోగ్యం కారణంగా భాస్కర్రెడ్డి రాలేదు. కీలక నిందితుడు దస్తగిరి గైర్హాజరయ్యాడు.
దీంతో కేసు విచారణను కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, వైఎస్ భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశిస్తూ విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.