కొత్త ప్రాజెక్టులకు మొండిచేయి కొనసాగుతున్న వాటికీ అరకొర పెరుగుతున్న అంచనా వ్యయం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మంగళం రైల్వే మంత్రి, అధికారుల వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కేంద్రం ఈ నెల 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేలకు అరకొర నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు రూ.8,406 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.4,418 కోట్లు మాత్రమే విదిల్చింది. తెలంగాణ నుంచి ప్రతిపాదనలు పంపిన కొత్త రైల్వేలైన్లను ఇవ్వకపోగా, పాత ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధులు కేటాయించింది. శుక్రవారం ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. అనంతరరం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఎస్సీఆర్ జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, ఏజీఎం ఉదయ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జోన్ పరిధిలో బడ్జెట్ కేటాయింపుల వివరాలను వెల్లడించారు.
మణుగూరు-రామగుండం కొత్త రైల్వేలైనుకు 10 కోట్లు
2013-14 బడ్జెట్లో మంజూరు చేసిన మణుగూరు-రామగుండం కొత్త రైల్వేలైను కోసం ఆనాడు రూ.1,112 కోట్లు అంచనా లెక్కలతో నిధులు కేటాయించారు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,911 కోట్లకు పెరిగినట్టు తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.10 కోట్లు కేటాయించారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,445 కోట్ల నుంచి రూ.2,154.83 కోట్లకు పెరిగింది. కానీ, బడ్జెట్లో రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తూచ్
కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం లేదని, పీవోహెచ్ ఓవర్హాలింగ్ కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ చెప్పుకొచ్చారు. దేశంలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీలు చాలానే ఉన్నాయని, కాజీపేటలో అవసరం లేదంటూ కొత్త ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి అవలంభించారు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన కొనసాగిస్తున్నారు. పైగా ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు విడుదల కావడం లేదని బుకాయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.260 కోట్ల వరకు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వందేభారత్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులోనూ కేంద్రం దగా..
వందేభారత్ ఎక్స్ప్రెస్ కోచ్ ఫ్యాక్టరీని కూడా తెలంగాణకు కేటాయించడం లేదని రైల్వేశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే చెన్నైలో వందేభారత్ కోచ్ ఫ్యాక్టరీ ఉన్నదని, తోడుగా హర్యానాలోని సోనీపట్, ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి, మహారాష్ట్రలోని లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.
మరికొన్ని కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన అరకొర నిధులు: