కొండాపూర్, ఆగస్టు 26: ‘స్కోర్ స్టెమ్ చాలెంజ్ 2022’ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమని, దశాబ్దాల శిక్షణా నైపుణ్యాలకు ప్రతీక అని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీలెర్న్ కోఫౌండర్ సుష్మ బొప్పన పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని వెస్టిన్ హోటల్లో శుక్రవారం శ్రీ చైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ కో ఫౌండర్ సీమ, ఇన్ఫినిటీలెర్న్ ప్రెసిడెంట్, సీఈఓ ఉజ్వల్ సింగ్తో కలిసి రూ.1000 కోట్ల విలువైన అతిపెద్ద స్కాలర్షిప్ ఎగ్జామ్ లోగోను ఆమె ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుష్మ బొప్పన మాట్లాడుతూ చదువులో ఉత్తమ ప్రతిభ కనుబరుస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వారిని ప్రోత్సహిస్తూ శ్రీ చైతన్య విద్యాసంస్థ ఎంతో మందికి అండగా నిలుస్తున్నదని తెలిపారు. ఉజ్వల్ సింగ్ మాట్లాడుతూ స్కోర్ స్టెమ్ చాలెంజ్ని ఈ నెల 26 నుంచి నవంబర్ 30 వరకు ఆన్లైన్లో http:// infinitylearn. com/score, ఆఫ్లైన్లో సెప్టెంబర్ 18, అక్టోబర్ 16, నవంబర్ 13న నిర్వహిస్తామని వివరించారు. 1 నుంచి 13 తరగతుల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.