కల్వకుర్తి, జూన్ 20: బలమైన సామాజిక విప్లవానికి దళితబంధు నాంది పలుకుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దళితబంధుకు దళితులు లబ్ధిదారులు కాదని, హక్కుదారులు అని స్పష్టంచేశారు. పేదలను ఆర్థిక, సామాజిక స్వతంత్రులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారంచుట్టారని వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రూ.5 కోట్లతో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్కు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కల్వకుర్తి, వెల్దండ మండలాలకు చెందిన 38 మంది దళితబంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ట్యాక్సీకార్లు, గూడ్స్ క్యారియర్లను పంపిణీ చేశారు. అనంతరం కల్వకుర్తి సమీపంలోని కేఎల్ఆర్ హాల్లో జిల్లా రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. తర్వాత కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలోని యాదయ్యగౌడ్కు చెందిన ఈత, ఖర్జూర వనాన్ని మంత్రి సందర్శించారు.
ఖర్జూర, ఈత చెట్ల పెంపకంపై తలెత్తుతున్న ఇబ్బందులను, లాభాల గురించి రైతులను అడిగి తెలుసుకొన్నారు. తోటను సంరక్షించుకోవాలని రైతులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీ వైస్ చైర్మర్ బాలాజీసింగ్ పాల్గొన్నారు.