అదిలాబాద్ : అడవుల జిల్లా ఆదిలాబాద్ మరో కశ్మీర్ను తలపిస్తున్నది. ప్రకృతి సోయగాలకు నెలవైన జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరుగుతున్నది.
పొగమంచుతో పాటు వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇగంతో ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు అడవులు, గుట్టల్లో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
బుధవారం మహబూబ్ఘాట్పై పొంగమంచు కమ్ముకోవడంతో ఆ దృశ్యాలు కనువిందు చేశాయి. పచ్చని చెట్లు, గుట్టపై వంకలు తిరగే రహదారివంటివి చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా, వ్యవసాయ పనులకు వెళ్లే వారు, వాహనదారులు మంచుతో ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఉదయం పది దాటినా కూడా భానుడు కనిపించలేదు.