హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్10(నమస్తే తెలంగాణ): ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే హాజరయ్యారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ డీఎస్ ప్రసాద్, బార్ అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ చెంగల్వ కళ్యాణరావు తదితరులు పాల్గొన్నారు.