హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అదే ఊరుకు చెందిన చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందులను కాలుస్తున్నారు. ఆ నాటు తుపాకీతో వారు పందులను కాల్చగా ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలిడిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.