హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు సమీపిస్తున్నది. జేఈఈ మెయిన్2, సీయూఈటీ (యూజీ), ఐకార్ ఏఐఈఈఏ, బిట్శాట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి వారం రోజుల సమయమే మిగిలి వున్నది.
ఈ పరీక్షలకు నెల రోజులకుపైగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. తుది గడువు ముగియనుండటంతో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు త్వరపడాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్2, సీయూఈటీ, ఐకార్ ఏఐఈఈఏ పరీక్షల దరఖాస్తులకు ఈ నెల 12 తుది గడువు కాగా, బిట్శాట్కు ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉన్నది.