హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాటిన యాపిల్ మొక్క.. నేడు కాయలు కాస్తున్నది. 2019 డిసెంబర్లో ములుగు పర్యటించిన సమయంలో ఉద్యానశాఖకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని సీఎం కేసీఆర్ సందర్శించారు. అప్పుడు అరుదైన యాపిల్ మొక్క నాటారు. ఇప్పుడది కాయలు కాయడం ప్రారంభించింది. కశ్మీర్తోపాటు అతిశీతల ప్రాంతాల్లోనే పెరిగే యాపిల్ చెట్టు.. ములుగులో వేడిని తట్టుకొని పెరిగి కాయలు కాయడం విశేషం. హెచ్ఆర్ఎంఎన్-99 రకంగా పిలుచుకునే ఈ రకం యాపిల్ను ములుగు సీవోఈలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఇప్పుడిది కాయలు కాస్తుండటంతో మన ప్రాంతం కూడా యాపిల్ సాగుకు అనుకూలమని తేలింది.