హిమాయత్నగర్, జూలై9: జర్నలిస్టులు కేవీఆర్, ప్రశ్న రావణ్లపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, నాయకుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రశ్నించే వారిపై ఉపా కేసు నమోదు చేయడమంటే బాబు ప్రభుత్వ నిర్బంధానికి నిదర్శనమని ఆరోపించారు.
అమీన్ఫూర్ (జిన్నారం): ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని అద్దె ఇంటిలోని హార్డు డిస్కులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.