హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీలకు ఇక నుంచి మూడేండ్లకొకసా రి అనుమతులు ఇవ్వనున్నారు. 2024, 27 విద్యాసంవత్సరానికి అనుమతులిచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) బుధవారం డ్రాఫ్ట్ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ విడుదల చేసింది. దీనిప్రకారం.. బీబీఏ, బీసీఏ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ రెండు కోర్సులు నిర్వహించే కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం వంటి అస్పిరేషనల్ జిల్లాల్లో విద్యావకాశాల పెంపునకు ప్రయత్నించాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ డ్రాఫ్ట్ మార్గదర్శకాలపై ఈ నెల 17లోపు సూచనలు సలహాలివ్వాలని తెలిపింది.