హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నం నగరంలోని ఆర్కేబీచ్లో సముద్రం ముందుకొచ్చింది. బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. సమీపంలోని చిల్డ్రన్పార్కులో ప్రహరీ కూలిపోయింది. బల్లలు విరిగిపోయాయి. ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
దీంతో బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి
నిషేంధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు నోవాటెల్ హోటల్ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్ తుఫాన్ కారణంగా ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.