ముషీరాబాద్, జూలై 4: ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న పల్లెల్లో మన జెండా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కోర్కమిటీ సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ వచ్చిందని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు బల్గర్ హుస్సేన్, చాపకృష్ణ, యాదన్న, యాకన్నచిన్నస్వామి, డప్పు శివరాజ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేష్, సల్లూరి శ్రీను, సారంగపాణి, మహేశ్, శ్యాంరావు, గురుకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.